WPL 2024 : మహిళల ప్రీమియర్ లీగ్ రెండో సీజన్(WPL 2024)లో రెండో మ్యాచ్ సైతం ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. చివరి ఓవర్ వరకూ అభిమానులను మునివేళ్లపై నిలబెట్టిన మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) అద్భుత విజయం సాధించింది. శనివారం యూపీ వారియర్స్తో సొంత మైదానంలో జరిగిన తొలి మ్యాచ్లో 2 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత రీచా ఘోష్(62), సబ్బినేని మేఘన దంచి కొట్టగా.. ఆ తర్వాత శోభనా ఆశ బంతితో విజృంభించి ఐదు వికెట్లు తీసింది. భారీ ఛేదనలో చివరి దాకా పోరాడిన యూపీ ఒత్తిడికి చిత్తైంది.
ఆర్సీబీ నిర్దేశించిన 158 పరుగల ఛేదనలో ఆదిలోనే ఓపెనర్ అలీసా హేలీ(5) వికెట్ కోల్పోయిన యూపీని ఓపెనర్ వ్రిందా దినేశ్(18), తహ్లియా మెక్గ్రాత్(22) ఆదుకున్నారు. అయితే.. శోభనా ఆశ ఒకే ఓవర్లో ఈ ఇద్దరినీ ఔట్ చేసింది.
The #UPW are moving along nicely in the chase!
Partnership between Shweta Sehrawat & Graze Harris is now 67*(43) 🔥🔥#UPW 116/3 with 5 overs to go!
Match Centre 💻📱 https://t.co/kIBDr0FhM4#TATAWPL | #RCBvUPW pic.twitter.com/I9vlHVg1MM
— Women’s Premier League (WPL) (@wplt20) February 24, 2024
ఆ తర్వాత వచ్చిన శ్వేతా షెరావత్(31), గ్రేస్ హ్యారిస్(38)లు నాలుగో వికెట్కు 77 పరుగులు జోడించి యూపీని గెలుపు వైపు నడిపించారు. చివర్లో పూనమ్ ఖెమ్నర్(14) వరుస బౌండరీలతో హడలెత్తించింది. ఆఖరి ఓవర్కు ఐదు పరుగులు అవసరం కాగా దీప్తి శర్మ(13) రెండు పరుగులు తీసిందంటే. దాంతో ఆర్సీబీ 2 పరుగుల తేడాతో గెలుపొందింది.
FIVE Wickets. 22 Runs 🫡
Incredible spell from Asha Sobhana 🔥🔥
Match Centre 💻📱 https://t.co/kIBDr0FhM4#TATAWPL | #RCBvUPW pic.twitter.com/snsIqK1Tcb
— Women’s Premier League (WPL) (@wplt20) February 24, 2024
మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీకి శుభారంభం దక్కలేదు. గ్రేస్ హ్యారిస్ ఓవర్లో ఓపెనర్ సోఫె డెవిన్(1) ఎల్బీగా ఔటయ్యింది. కెప్టెన్ స్మృతి మంధాన(13) ఫుల్ షాట్ ఆడబోయి వ్రిందా దినేశ్ చేతికి చిక్కడంతో బెంగళూరు జట్టు 36 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది.
Innings Break!
Fifties from Sabbhineni Meghana & Richa Ghosh guide #RCB to 157/6 😎
Will it be enough for @UPWarriorz? Find out 🔜
Match Centre 💻📱 https://t.co/kIBDr0FhM4#TATAWPL | #RCBvUPW pic.twitter.com/2x85howr6r
— Women’s Premier League (WPL) (@wplt20) February 24, 2024
మిడిలార్డర్లో రీచా ఘోష్(62), తెలుగమ్మాయి సబ్బినేని మేఘన(53)లు హాఫ్ సెంచరీలతో కదం తొక్కారు. దాంతో, 49 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ. నిర్ణీత ఓవర్లలో6 వికెట్ల నష్టానికి 157 పరుగులు బాదింది. యూపీ బౌలర్లలో రాజేశ్వరీ గైక్వాడ్ రెండు వికెట్లు తీసింది.