హైదరాబాద్: ఐపీఎల్ తాజా సీజన్లో మరో అరుదైన రికార్డు నమోదైంది. తాజా సీజన్తో కలిపి ఇప్పటివరకు మొత్తం 16 ఐపీఎల్ టోర్నీలు జరుగగా ఈ సీజన్లోనే అత్యధికంగా 200 ప్లస్ స్కోర్లు నమోదయ్యాయి. శుక్రవారం రాత్రి పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్లో రెండు జట్లు 200పైగా స్కోర్లు చేశాయి.
తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 257 పరుగులు చేయగా.. భారీ లక్ష్యాన్ని చేధించడం కోసం బరిలో దిగిన పంజాబ్ 19.5 ఓవర్లలో 201 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. ఈ మ్యాచ్లో నమోదైన రెండు 200 ప్లస్ స్కోర్లతో కలిపి ఈ ఐపీఎల్ సీజన్లో ఇప్పటివరకు మొత్తం 20 సార్లు 200కు పైగా పరుగులు నమోదయ్యాయి.
దాంతో గత ఐపీఎల్ సీజన్లో నమోదైన అత్యధిక 200 ప్లస్ స్కోర్ల రికార్డు బద్ధలైంది. 2022లో జరిగిన ఐపీఎల్ సీజన్ 15లో మొత్తం 18 సార్లు 200కు పైగా స్కోర్లు నమోదు కాగా, ఈ ఐపీఎల్లో ఇప్పటివరకు జరిగిన 38 మ్యాచ్లలోనే ఆ రికార్డు బద్ధలైంది. ఈ సీజన్లో ఇంకా చాలా మ్యాచ్లు జరగాల్సి ఉన్నందున మరికొన్ని 200 ప్లస్ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉన్నది.