పంజాబ్ జట్టు బ్యాటింగ్ తడబడుతోంది. ఆరంభంలోనే అద్భుతంగా ఆడిన ఆ జట్టు బ్యాటర్లు క్రీజులో ఎక్కువ సేపు నిలవలేకపోతున్నారు. మయాంక్ అగర్వాల్ (19) కాసేపు మాత్రమే క్రీజులో ఉండి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జితేష్ శర్మ (9)ను హసరంగ పెవిలియన్ చేర్చాడు. హసరంగ వేసిన బంతిని ముదుకొచ్చి బాదేందుకు జితేష్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతిని మిస్ అయ్యాడు. అది నేరుగా వెళ్లి వికెట్లను కూల్చడంతో అతను పెవిలియన్ చేరాడు. ఆ తర్వాతి ఓవర్లోనే హర్షల్ పటేల్ బౌలింగ్లో హర్ప్రీత్ బ్రర్ (7) పెవిలియన్ చేరాడు.
అంతకుముందు బంతినే భారీ సిక్సర్ కొట్టిన బ్రర్.. మరుసటి బంతిని ఆఫ్సైడ్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ అది కుదర్లేదు. దాంతో ఎడ్జ్ తీసుకున్న బంతి కీపర్ దినేష్ కార్తీక్కు క్యాచ్ వెళ్లింది. అతను దాన్ని అందుకోవడంతో పంజాబ్ జట్టు ఆరో వికెట్ కోల్పోయింది. దీంతో 18 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ జట్టు 6 వికెట్ల నష్టానికి 181 పరుగులతో నిలిచింది.