పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో బెంగళూరు జట్టుకు గట్టి షాక్ తగిలింది. మంచి టచ్లో కనిపించిన కోహ్లీ (20) పెవిలియన్ చేరిన కాసేపటికే.. ఫామ్లో ఉన్న కెప్టెన్ డుప్లెసిస్ (10) పెవిలియన్ చేరాడు. రిషి ధావన్ వేసిన ఐదో ఓవర్ రెండు బంతిని ముందుకొచ్చి ఆడబోయాడు. ఈ క్రమంలో బంతిని మిస్ అయ్యాడు. అది కీపర్ చేతుల్లో పడింది.
ధావన్ అప్పీల్ చేయగా అంపైర్ అవుట్ ఇవ్వలేదు. అయితే కీపర్ జితేష్ మాత్రం కచ్చితంగా బ్యాట్ తగిలిందని నమ్మాడు. అతని నమ్మకాన్ని చూసిన మయాంక్ రివ్యూ తీసుకున్నాడు. రిప్లేలో బంతి డుప్లెసిస్ బ్యాటును తాకినట్లే తేలడంతో అతను పెవిలియన్ చేరాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మహిపాల్ లోమ్రోర్ (6) కూడా తను ఎదుర్కొన్న రెండో బంతికే పెవిలియన్ చేరాడు. మొదటి బంతికి భారీ సిక్సర్ కొట్టిన అతను.. తర్వాతి బంతిని లెగ్ సైడ్ ఆడటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో నేరుగా శిఖర్ ధావన్కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 40 పరుగుల వద్ద బెంగళూరు జట్టు మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.