స్పోర్ట్స్ బెట్టింగ్తో భారీగా లాభాలు వస్తాయని, దీన్ని భారతదేశంలో చట్టబద్ధం చేస్తే బాగుంటుందని టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ఒక మీడియా కార్యక్రమంలో పాల్గొన్న రవిశాస్త్రి.. బెట్టింగ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బెట్టింగ్ను చట్టబద్ధం చేయాలని సూచించాడు. ‘పన్ను పరంగా చూసుకుంటే ఇది (బెట్టింగ్) ప్రభుత్వానికి భారీగా ఆదాయం తెచ్చిపెడుతుంది. ప్రస్తుతం ప్రపంచం అనుసరిస్తున్న మార్గమిదే’ అని రవిశాస్త్రి చెప్పాడు.
ఈ రంగాన్ని ఎంతగా అణచివేయాలని చూసినా కుదరదని తెలిపాడు. ‘మనం దాన్ని ఎంతగా తొక్కేయాలని చూసినా.. ఇతర మార్గాల ద్వారా ఇది అంతే బలంగా పైకి లేస్తుంది’ అని వివరించాడు.
ఇదిలా వుండగా, టెస్టుల్లో తనకు తెలిసి అత్యుత్తమ కెప్టెన్ విరాట్ కోహ్లీనే అని స్పష్టం చేసిన ఈ మాజీ కోచ్.. ఇప్పటి వరకూ కోహ్లీ సాధించిన విజయాలు పరిశీలించాలని, ప్రపంచంలో మరెవరూ అంత ప్యాషన్తో జట్టును నడిపించడం కనిపించదని కొనియాడాడు. అలాగే గంగూలీ-కోహ్లీ వివాదంపై కూడా స్పందించాడు. కోహ్లీ తన వైపు కథ వినిపించాడని, గంగూలీ కూడా బయటకు వచ్చి ఏం జరిగిందో చెప్పాలని అన్నాడు.