దుబాయ్ : ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్లో భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లండ్ ఫాస్ట్బౌలర్ జేమ్స్ అండర్సన్ అగ్రస్థానాన్ని పంచుకున్నారు.
గత వారం నంబర్ వన్ ర్యాంకింగ్ను కైవసం చేసుకున్న అశ్విన్ ఈ వారం ఆరు ర్యాంకింగ్ పాయింట్లు కోల్పోయినా అగ్రస్థానాన్ని మాత్రం అండర్సన్తో కలిసి పంచుకున్నాడు. ఇరువురూ 859 పాయింట్లతో సమానంగా ఉన్నారు. కాగా పాట్ కమిన్స్ (849), కగిసో రబాడ(807), నాథన్ లియాన్(769) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారు.