ముంబై: రాబోయే దేశవాళీ సీజన్లో ముంబై సీనియర్ టీమ్కు హెడ్ కోచ్గా దేశవాళీ క్రికెట్ దిగ్గజం, ముంబై మాజీ కెప్టెన్ అమోల్ మజుందార్ నియమితులయ్యారు. ఇటీవల భారత మహిళల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా రమేశ్ పొవార్ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో అతని స్థానంలో ముంబై కోచ్గా మజుందార్ను ఎంపికచేశారు. భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ కూడా కోచ్ పదవి కోసం పోటీపడ్డారు. మొత్తం 9 మంది హెడ్ కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకున్నారు.
జతిన్ పరాంజ్పే(ఛైర్మన్), నీలేశ్ కులకర్ణి, వినోద్ కాంబ్లీలతో కూడిన ఎంసీఏ క్రికెట్ అభివృద్ధి కమిటీ మజుందార్ను కోచ్గా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకుంది. 1993-2013 మధ్య మజుందార్ 171 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 11,167 పరుగులు సాధించాడు.