Ranji Trophy 2024 | దేశవాళీలో ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ తుది అంకానికి చేరుకున్నది. ముంబై – బరోడా మధ్య కొద్దిసేపటి క్రితమే మ్యాచ్ డ్రా గా ముగిసిన నేపథ్యంలో సెమీస్లో ఆడబోయే నాలుగు జట్లూ తమ బెర్తులను ఖాయం చేసుకున్నాయి. క్వార్టర్స్లో విదర్భ – కర్నాటక, ముంబై – బరోడా, సౌరాష్ట్ర – తమిళనాడు, మధ్యప్రదేశ్ – ఆంధ్రలు తలపడ్డాయి. ఈ 8 జట్లలో కర్నాటక, బరోడా, సౌరాష్ట్ర, ఆంధ్రలు క్వార్టర్స్లోనే ఇంటిబాట పట్టాయి.
డిఫెండింగ్ ఛాంపియన్ సౌరాష్ట్రను ఓడించిన తమిళనాడు.. తొలి సెమీస్ బెర్తను ఖాయం చేసుకోగా విజయానికి అత్యంత చేరువగా వచ్చి నాలుగు పరుగుల తేడాతో ఆంధ్రాను ఓడించిన మధ్యప్రదేశ్ సెమీస్కు వెళ్లిన రెండో జట్టు. ఇక నేడు కర్నాటకను 127 పరుగుల తేడాతో ఓడించిన విదర్భ సెమీస్లోకి ప్రవేశించగా బరోడాతో మ్యాచ్ డ్రాగా ముగియడంతో ముంబై జట్టు సెమీస్ గడపతొక్కింది. తొలి ఇన్నింగ్స్ లీడ్ కారణంగా ముంబై.. సెమీస్కు అర్హత సాధించింది.
ముంబై – బరోడా మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసిన ముంబై 384 పరుగులు చేయగా బరోడా 348 పరుగులకే ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్లో ముంబై 569 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం బరోడా.. 30 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది.
Mumbai vs Baroda – Match Drawn Mumbai took first innings lead (Qualified) #MUMvBDA #RanjiTrophy #Elite #QF2 Scorecard:https://t.co/b9E2cfsNDv
— BCCI Domestic (@BCCIdomestic) February 27, 2024
సెమీస్లో ఎవరు..? ఎవరితో..?
– మార్చి 02 నుంచి 06 దాకా సెమీఫైనల్స్ మ్యాచ్లు జరుగనున్నాయి. ఇందులో భాగంగా తొలి సెమీస్లో మధ్యప్రదేశ్ జట్టు.. విదర్భతో తలపడనుంది.
– రెండో సెమీస్లో ముంబై.. తమిళనాడును ఢీకొంటుంది. ఈ రెండు మ్యాచ్లకు బీసీసీఐ ఇంకా వేదికలను ప్రకటించాల్సి ఉంది.
– సెమీస్ గెలిచిన రెండు జట్లు.. మార్చి 10 నుంచి 14 దాకా సాగే ఫైనల్లో తాడో పేడో తేల్చుకుంటాయి.