పుణె: టాటా ఓపెన్ మహారాష్ట్ర టోర్నీలో భారత స్టార్ టెన్నిస్ ఆటగాడు రామ్కుమార్ రామనాథన్ వైల్డ్ కార్డు ద్వారా బరిలోకి దిగనున్నాడు. గత నవంబర్లో ఏటీపీ చాలెంజర్ టైటిల్ను సొంతం చేసుకున్న రామ్కుమార్ ఈనెల 31 నుంచి జరుగనున్న టాటా ఓపెన్ టెన్నిస్ టోర్నీలో పాల్గొననున్నాడు. పురుషుల సింగిల్స్ తొలి పోరులో యూకీ బాంబ్రితో రామ్కుమార్ తలపడనున్నాడు. పురుషుల డబుల్స్లో రోహన్ బోపన్నతో కలిసి రామ్కుమార్ బరిలోకి దిగనున్నాడు.