హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ సీనియర్ పురుషుల హాకీ చాంపియన్షిప్లో పాల్గొనే తెలంగాణ జట్టును రాష్ట్ర హాకీ సంఘం గురువారం ప్రకటించింది. ఈ నెల 9 నుంచి 12 వరకు భోపాల్ వేదికగా జరుగనున్న ఈ టోర్నీలో పాల్గొనే మన జట్టుకు రామకృష్ణ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు తెలంగాణ హాకీ సంఘం కార్యదర్శి ముఖేశ్ కుమార్ వివరాలు వెల్లడించారు. జట్టులో నర్సింగ్రావు, అరవింద్, జయవర్ధన్, వినీత్, భరత్కుమార్, రాకేశ్, సందీప్, ఆదిత్య సాగర్, సాయికుమార్, అబ్దుల్ మోయిజ్, ఫిరోజ్, మహేశ్ రెడ్డి, హబీబ్, లక్ష్మణ్, బీ రాకేశ్, క్రాంతికుమార్, రవితేజ్ చోటు దక్కించుకున్నారు. ఈ టీమ్కు సురేందర్ సింగ్ కోచ్గా.. మహమ్మద్ హబీబ్ మేనేజర్గా వ్యవహరించనున్నారు.