PV Sindhu | బర్మింగ్హామ్: ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పోరాటం ముగిసింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో సింధు 19-21, 11-21తో అన్ సె యంగ్(కొరియా) చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇటీవలే గాయం నుంచి తిరిగి కోర్టులోకి అడుగుపెట్టిన సింధు..ప్రపంచ నంబర్వన్ యంగ్కు దీటైన పోటీనివ్వలేకపోయింది. 42 నిమిషాల్లోనే ముగిసిన పోరులో యంగ్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.
కొరియా షట్లర్తో ముఖాముఖి పోరులో సింధు ఏడోసారి ఓటమిపాలైంది. పురుషుల సింగిల్స్లో లక్ష్యసేన్ 24-22, 11-21, 21-14తో అండ్రెస్ అంటోనెస్పై గెలిచి ముందంజ వేశాడు. మహిళల డబుల్స్లో తనీషా క్రాస్టో, అశ్విని పొనప్ప జోడీ 21-11, 11-21, 11-21తో జాంగ్ షు, జాంగ్ యు ద్వయంపై గెలిచి క్వార్టర్స్లోకి ప్రవేశించింది.