హైదరాబాద్: మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు(PV Sindhu).. క్వార్టర్స్ మ్యాచ్లో ఓటమిపాలైంది. థాయిలాండ్కు చెందిన సుపనిద కేటితాంగ్ చేతిలో సింధు పరాజయం చవిచూసింది. అయితే ఓటమి తట్టుకోలేక సింధు .. గేమ్ ముగిశాక తన చేతుల్లో ఉన్న రాకెట్ను నేలకు కొట్టింది. ఈ ఘటనను నిర్వాహకులు సీరియస్గా తీసుకున్నారు. ప్రవర్తన సరిగా లేని కారణంగా.. పీవీ సింధుకు ఎల్లో కార్డు జారీ చేశారు. చైర్ అంపైర్ ఆ కార్డు జారీ చేశాడు. ప్రవర్తన సరిగా లేని షట్లర్లకు ఎల్లో కార్డు జారీ చేస్తుంటారు.
ఆరో సీడ్ సుపనిద కేటితాంగ్ 24-26 21-17 22-20 స్కోరుతో వీపీ సింధుపై విజయం సాధించింది. తొలి గేమ్ 4-8 తేడాతో వెనుకబడి ఉన్న సింధు ఆ తర్వాత తన జోరును పెంచి తొలి గేమ్ను 24-26 తేడాతో కైవసం చేసుకున్నది. టోర్నీ నుంచి స్పెయిన్ క్రీడాకారణి కరోలినా మారిన్ తప్పుకోవడంతో ..పీవీ సింధు టోర్నీ ఫెవరేట్గా నిలిచారు.
PV Sindhu lost her cool after losing an intense battle against Thai 🇹🇭 shuttler. #Badminton #PVSindhu #RoadToParis@BadmintonJust @befikramusafir @Anmolkakkar27 @ankhitweets @IndiaSportsHub pic.twitter.com/wkLvu1wE93
— Pahadi Brothers Sports (@Sportsbypahadi) March 29, 2024