ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 10వ సీజన్ ఈ ఏడాది డిసెంబర్లో జరుగనుంది. ఐపీఎల్ అడుగు జాడల్లో నడుస్తూ.. తొమ్మిది సీజన్లుగా విశేష ప్రేక్షకాదరణ పొందిన పీకేఎల్ పదో సీజన్ను డిసెంబర్ 2 నుంచి ప్రారంభించనున్నట్లు లీగ్ కమిషనర్ అనుపమ్ గోస్వామి గురువారం వెల్లడించారు.
గత సీజన్లను మరిపించేలా ఈ సారి లీగ్ నిర్వహిస్తామని.. త్వరలోనే షెడ్యూల్ విడుదల చేస్తామని పేర్కొన్నారు. ఈ సారి పీకేఎల్ మ్యాచ్లను దేశంలోని 12 నగరాల్లో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.