ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో 1000 పరుగులు చేసిన రెండో అతి పిన్న వయస్కుడిగా పృథ్వీ షా(21 ఏండ్ల, 169 రోజులు) రికార్డు సృష్టించాడు. ఈ అరుదైన జాబితాలో ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్(20ఏండ్ల 218 రోజులు ) మొదటి స్థానంలో ఉన్నాడు.
మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్దేశించిన 172 పరుగుల ఛేదనలో షా ఈ ఫీట్ అందుకున్నాడు. ఈ క్రమంలోనే సంజూ శాంసన్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను షా అధిగమించాడు. 21ఏండ్ల షా 2018లో క్యాపిటల్స్తో తన ఐపీఎల్ కెరీర్ను ప్రారంభించాడు. ఇప్పటి వరకు 44 మ్యాచ్ల్లో 1013 పరుగులు సాధించాడు. అందులో 8 అర్ధశతకాలు ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి-మార్చిలో జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో పరుగుల వరద పారించిన షా మళ్లీ ఫామ్ అందుకున్నాడు. ప్రస్తుత ఐపీఎల్లోనూ తనదైన శైలిలో కీలక ఇన్నింగ్స్లు ఆడుతున్నాడు.