చెన్నై: ప్రతిష్ఠాత్మక మెల్ట్వాటర్ చాంపియన్స్ చెస్ టూర్ చెసేబుల్ మాస్టర్స్ టోర్నీ టైటిల్కు భారత యువ గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద అడుగు దూరంలో నిలిచాడు. మంగళవారం అర్ధరాత్రి జరిగిన సెమీస్లో చెన్నై కుర్రాడు ప్రజ్ఞానంద 3.5-2.5తో అనిశ్ గిరి (డెన్మార్క్)ను ఓడించాడు. తొలి రౌండ్లో స్కోర్లు సమం కాగా.. రెండో రౌండ్లో మనోడు ఆధిక్యం కనబర్చాడు. మూడో గేమ్ను కూడా డ్రా కాగా.. 2-1తో ఇద్దరి మధ్య ఉత్కంఠగా మ్యాచ్ కొనసాగింది. ఆఖరి రౌండ్లో అనిశ్ విజృంభించి స్కోర్ను 2-2తో సమం చేశాడు. విజేతను నిర్ణయించేందుకు జరిగిన టై బ్రేక్లో డెన్మార్క్ జీఎం స్కోర్ సాధించడంలో విఫలమవగా.. ప్రజ్ఞానంద ఒక పాయింట్ ఖాతాలో వేసుకుని 3.5-2.5తో ఆట ముగించాడు. ప్రజ్ఞానంద తుది పోరులో డింగ్ లిరెన్ (చైనా)తో అమీతుమీ తేల్చుకోనున్నాడు.