IND vs WI : వన్డే సిరీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు టీ20 సిరీస్(T20 Series)లోనూ చెలరేగారు. దాంతో, ఆతిథ్య వెస్టిండీస్ మొదటి టీ20లో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు కొట్టింది. బ్రియాన్ లారా స్టేడియంలో జరిగిన మ్యాచ్లో కెప్టెన్ రొవ్మన్ పావెల్(48), నికోలస్ పూరన్(41)పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో చాహల్ రెండు వికెట్లు పడగొట్టాడు. చౌనామన్ కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా, అర్ష్దీప్ సింగ్ తలా ఒక వికెట్ తీశారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న విండీస్ను యజువేంద్ర చాహల్ దెబ్బకొట్టాడు. ఆదిలోనే కీలకమైన కైల్ మేయర్స్(1) బ్రాండన్ కింగ్(28)లను వెనక్కి పంపాడు. ఆ తర్వాత వచ్చిన జాన్సన్ చార్లెస్(3)ను కుల్దీప్ యాదవ్ బోల్తా కొట్టించాడు. కష్టాల్లో పడిన విండీస్ను కెప్టెన్ పావెల్, పూరన్ ఆదుకున్నారు. వీళ్లు వికెట్కు పరుగులు జోడించారు. దాంతో, ఆతిథ్య జట్టు పోరాడగలిగే స్కోర్ చేయగలిగింది.