హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): అఖిల భారత పోలీసు క్రీడల నియంత్రణ బోర్డు (ఏఐపీఎస్సీబీ) ఆధ్వర్యంలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) నిర్వహించిన అఖిల భారత పోలీసు జూడో క్లస్టర్ చాంపియన్ షిప్ పోటీలు గురువారం ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీజీపీ సి.వి.ఆనంద్ హాజరై.. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర పోలీసు దళాలు, కేంద్ర సాయుధ పోలీసు దళాలకు చెందిన 36 జట్లను ఒకచోట చేర్చి, ఈ చాంపియన్ షిప్ను అత్యంత సమర్థంగా నిర్వహించడం ప్రశంసనీయమన్నారు.
ఇలాంటి క్రీడలు పతకాలకు అతీతంగా జాతీయ సమైక్యతను బలోపేతం చేస్తాయని, పోలీసు దళాల మధ్య సోదర భావాన్ని పెంపొందిస్తాయని అన్నారు. ఈ పోటీల్లో ఓవరాల్ ట్రోఫీ విజేతగా నిలిచిన ఎస్ఎస్బీ, రెండో స్థానంలో నిలిచిన సీఐఎస్ఎఫ్, మూడో స్థానంలో నిలిచిన ఐటీబీపీ జట్లను ఆయన అభినందించారు.