పనాజీ: బెట్టింగ్ రాకెట్ను గోవా పోలీసులు పట్టుకున్నారు. ఐపీఎల్ మ్యాచ్లపై బెట్టింగ్కు పాల్పడిన ఆరుగుర్ని అరెస్టు చేశారు. గత రాత్రి వాస్కో ప్రాంతం నుంచి వాళ్లను అదుపులోకి తీసుకున్నారు. భారీ మొత్తంలో రాకెట్ను నడుపుతున్నట్లు సౌత్ గోవా పోలీసులు వెల్లడించారు.