టోక్యో: భారత గోల్ఫ్ క్రీడాకారిని అదితి అశోక్ అనూహ్య రీతిలో టోక్యో ఒలింపిక్స్లో మెరిసింది. ప్రస్తుతం ఆమె మహిళల వ్యక్తిగత స్ట్రోక్ప్లే ఈవెంట్లో మూడవ స్థానంలో ఉంది. అయితే న్యూజిలాండ్కు చెందిన గోల్ఫర్ లిడియా కో కూడా మూడవ స్థానంలో ఉంది. వర్షం కారణంగా గోల్ఫ్ నాలుగవ రౌండ్ ఆటను ఇవాళ ఆపేశారు. పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆటను నిలిపివేసినట్లు అధికారులు చెప్పారు. ఇవాళ మధ్యాహ్నం లేదా రేపు.. వీలును బట్టి మిగితా రౌండ్ను నిర్వహించనున్నారు. ఒకవేళ గోల్ఫ్ ఆటను రద్దు చేస్తే, అప్పడు అదితి అశోక్కు మెడల్ దక్కుతుంది. నిన్న మూడవ రౌండ్ ముగిసే సమయంలో అదితి రెండవ స్థానంలో నిలిచింది.