లక్నో సూపర్ జెయింట్స్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ ఓపెనర్ శిఖర్ ధవన్ (6) నిరాశ పరిచాడు. 154 లక్ష్య ఛేదనలో జట్టుకు ధనాధన్ ఓపెనింగ్ ఇవ్వడంలో విఫలమైన అతను.. వికెట్ను కూడా కాపాడుకోలేకపోయాడు. రవి బిష్ణోయి వేసిన 7వ ఓవర్ మూడో బంతికి బంతిని సరిగా అంచనా వేయలేక పెవిలియన్ చేరాడు.
అంతకుముందే మయాక్ అగర్వాల్ (25) కూడా అవుటయ్యాడు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ నిర్మించాల్సిన ధవన్.. బిష్ణోయి వేసిన యార్కర్ లెంగ్త్ బాల్ను స్వీప్ చేయడానికి ప్రయత్నించి మిస్ అయ్యాడు. క్లీన్బౌల్డ్ అయ్యి పెవిలియన్ చేరాడు. దీంతో 46 పరుగుల స్కోరు వద్ద పంజాబ్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది.