న్యూఢిల్లీ: టేబుల్ టెన్నిస్ అండర్-17 ప్రపంచ ర్యాంకింగ్స్లో భారత ప్యాడ్లర్ పాయస్ జైన్ నంబర్వన్ ర్యాంక్లో నిలిచాడు. అంతర్జాతీయ టీటీ సమాఖ్య(ఐటీటీఎఫ్) ప్రపంచ ర్యాంకింగ్స్లో అగ్ర స్థానం దక్కించుకున్నాడు. ఢిల్లీకి చెందిన పాయస్ స్లోవ్నియా, ట్యునీషియా, ఒమన్లో పతకాలు సాధించిన పాయస్ 3,458 పాయింట్లతో ర్యాంకింగ్స్లో టాప్కు దూసుకెళ్లాడు. ఒకే సీజన్లో మూడు టైటిళ్లును చేజిక్కించుకుని అరుదైన ఘనత సాధించాడు.