Riyan Parag : విజయ్ హజారే ట్రోఫీలో అస్సాం ఆల్రౌండర్ సెంచరీతో చెలరేగాడు. జమ్యూ కాశ్మీర్తో సోమవారం జరిగిన కీలకమైన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో 174 పరుగులు చేసి జట్టుని గెలిపించాడు. మ్యాచ్ అనంతరం అతను చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. టీమిండియా మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్కు కౌంటర్గా రియాన్ ఈ ట్వీట్ చేశాడు. ‘దేశవాళీ టోర్నమెంట్ గ్రూప్ దశ మ్యాచ్లలో పెద్ద జట్లతో ఈశాన్య ప్రాంతాలకు చెందిన టీమ్స్ను ఆడించడం దండగ. దానివల్ల ఇతర జట్ల రన్రేట్ తగ్గిపోతుంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయిందనుకోండి అప్పుడు ఏంటి పరిస్థితి. ఈ జట్లు వేరే గ్రూప్లో ఆడి, క్వాలిఫై అయితే బాగుంటుంది’ అంటూ ఈమధ్యే దినేశ్ కార్తిక్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.
ఈ ఏడాది అస్సాం జట్టు మొదటిసారిగా విజయ్ హజారే ట్రోఫీలో క్వార్టర్ ఫైనల్కు చేరింది. మొదట బ్యాటింగ్ చేసిన జమ్మూ కాశ్మీర్ 351 పరుగుల భారీ స్కోర్ చేసింది. రియాన్ 116 బంతుల్లో 174 రన్స్ చేయడంతో అస్సాం ఈ మ్యాచ్ గెలిచింది. మొదటిసారి విజయ్ హజారే టోర్నమెంట్లో సెమీఫైనల్కు చేరింది. అస్సాంతో పాటు మహారాష్ట్ర, కర్నాటక, సౌరాష్ట్ర జట్లు సెమీఫైనల్కు చేరాయి. గ్రూప్ స్టేజ్లో రియాన్ పరాగ్ రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. ఇతను ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్నాడు.