షార్జా: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన పాకిస్థాన్.. ఆసియా కప్ సూపర్-4కు అర్హత సాధించింది. శుక్రవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో పాక్ 155 పరుగుల తేడాతో హాంకాంగ్ను మట్టికరిపించింది. పొట్టి ఫార్మాట్లో పాకిస్థాన్కు ఇదే అతిపెద్ద విజయం కాగా.. ఆదివారం మరోసారి టీమ్ఇండియాతో పాక్ తలపడనుంది. మొదట పాక్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది.
‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ రిజ్వాన్ (78 నాటౌట్), ఫఖర్ జమాన్ (53) అర్ధశతకాలు సాధించగా.. ఖుష్దిల్ షా (35 నాటౌట్; 5 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. అనంతరం ఛేదనలో హాంకాంగ్ 38 పరుగులకే ఆలౌటైంది. షాదాబ్ ఖాన్ (4/8), నవాజ్ (3/5) ధాటికి హాంకాంగ్ ప్లేయర్లలో ఒక్కరంటే ఒక్కరు కూడా రెండంకెల స్కోరు చేయలేకపోయారు.