చండీఘడ్: పాకిస్థాన్ మాజీ క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ షోయెబ్ అక్తర్.. పది కోట్ల నష్టపరిహారం చెల్లించాలని ఆ దేశానికి చెందిన పాకిస్థాన్ స్పోర్ట్స్ టీవీ లీగల్ నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్, న్యూజిలాండ్ మ్యాచ్పై టీవీలో చర్చ జరుగుతున్న సమయంలో ఆ షో నుంచి షోయెబ్ అకస్మాత్తుగా వెళ్లిపోయాడు. కంపెనీ ఒప్పందాలను ఉల్లంఘించిన నేపథ్యంలో అక్తర్కు నోటీసులు ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. ఎటువంటి సమాచారం ఇవ్వకుండా టీవీ షో నుంచి వెళ్లిపోవడంతో పాటు దుబాయ్ నుంచి కూడా వెనుదిరిగి వెళ్లాడు. హర్భజన్తో జరిగే ఓ ఇండియన్ టీవీ షో నుంచి కూడా అక్తర్ అర్ధాంతరంగా డీల్ ముగించేశాడు. నష్టపరిహారం చెల్లించకుంటే న్యాయపరమైన చర్యలకు పూనుకుంటామని పీటీవీ యాజమాన్యం అక్తర్కు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.