టీ20 వరల్డ్ కప్లో భాగంగా ఇవాళ సెమీ ఫైనల్ 2 మ్యాచ్ జరుగుతోంది. పాకిస్థాన్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్లో పాకిస్థాన్ బ్యాటింగ్ చేస్తోంది. అయితే.. పాకిస్థాన్ ఓపెనర్లు రిజ్వాన్, బాబర్ ఆజమ్.. ఇద్దరు చెలరేగిపోయి ఆడుతున్నారు. పవర్ ప్లే ముగిసే సమయానికి 6 ఓవర్లకు 47 పరుగులు చేశారు. రిజ్వాన్ 18 బంతుల్లో 21 పరుగులు చేసి రెండు ఫోర్లు, ఒక సిక్స్ బాదాడు. ఇక.. కెప్టెన్ బాబర్ ఆజమ్.. 18 బంతుల్లో 24 పరుగులు చేసి నాలుగు ఫోర్లు బాదాడు.