సిడ్నీ: పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ బౌలర్ జేసన్ గిలెస్పీ(Jason Gillespie) గతంలో కోచ్గా చేశారు. అయితే ప్రస్తుతం పాక్ క్రికెట్లో జరుగుతున్న సంక్షోభ పరిణామాలపై గిలెస్పీ స్పందించారు. పాక్ క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్గా ఆకిబ్ జావిద్ను నియమించిన తర్వాత ఆ దేశ జాతీయ జట్టు క్షీణించినట్లు గిలెస్పీ పేర్కొన్నారు. పీసీబీ చైర్మెన్ మోషిన్ నఖ్వీ నియమించిన ఆకిబ్ జావిద్ తనకు నచ్చినట్లు వ్యవహరించాడని ఆసీస్ బౌలర్ ఆరోపించాడు. ఆకిబ్ నియామకంతో పాక్ క్రికెట్లో క్షీణ దశ మొదలైందని, అతని రాక తర్వాత పాక్ క్రికెట్తో తన రిలేషన్ కూడా మారిందన్నాడు. అప్పటి వరకు వరకు ఉన్న తన బాధ్యతలు, పాత్ర మారినట్లు చెప్పాడు. ఇది వ్యక్తిగతంగా కూడా తనను నిర్వీర్యం చేసిందన్నాడు.
ఆటగాళ్లు, సిబ్బంది సెలెక్షన్లో ఒకప్పుడు తన పాత్ర ఉండేదని, కానీ ఆకిబ్ జావిద్ వచ్చిన తర్వాత తన పాత్ర కనుమరుగైందన్నారు. అయితే ఇదంతా తన కోచింగ్ సామర్థ్యంపై దెబ్బపడినట్లు చెప్పాడు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఇంకా తన పరిహారాన్ని చెల్లించలేదని గిలెస్పీ ఆరోపించాడు. వేల వేల డాలర్లు బాకీ ఉన్నట్లు పేర్కొన్నాడు. తన సూత్రాలకు తాను కట్టుబడి ఉన్నానని, అందుకే ఆకిబ్ జావిద్ మార్పులను అంగీకరించలేదని, దాంతో పాక్ క్రికెట్ కోచింగ్ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు గిలెస్పీ తెలిపాడు.
తన పట్ల ఆకిబ్ అమర్యాదగా ప్రవర్తించినట్లు గిలెస్పీ పేర్కొన్నాడు. ఆకిబ్కు పీసీబీ చైర్మెన్ అండదండలు ఉన్నాయని, జట్టు విషయంలో అతను ఎవరి సలహాలను స్వీకరించేవాడు కాదని ఆసీస్ క్రికెటర్ తెలిపాడు. పాక్ క్రికెట్ బోర్డులో ఆకిబ్ జావెద్ ఉన్నన్ని రోజులు.. ఆ జట్టు వెనక్కి వెళ్తూనే ఉంటుందని గిలెస్పీ అన్నాడు.