ఇస్లామాబాద్: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్(Babar Azam).. వన్డే క్రికెట్లో కొత్త రికార్డు క్రియేట్ చేశాడు. వంద వన్డేల్లో అత్యధిక రన్స్ చేసిన క్రికెటర్గా నిలిచాడు. కరాచీలో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో బాబర్ ఆజమ్ ఒక్క రన్ మాత్రమే చేసినా.. ఓవరాల్గా వంద వన్డేల్లో అతను తన ఖాతాలో అయిదువేల రన్స్ వేసుకున్నాడు. హసిమ్ ఆమ్లా రికార్డును అతను దాటేశాడు.
బాబర్ ఆజమ్ వంద వన్డేల్లో మొత్తం 5089 రన్స్ చేశాడు. ఇక ఇండియన్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మాత్రం వంద మ్యాచుల్లో 4107 రన్స్ మాత్రమే చేశాడు. కోహ్లీ యావరేజ్ 48.89 కాగా, బాబర్ యావరేజ్ 59.17గా ఉంది. ఇప్పటి వరకు కోహ్లీ మొత్తం 274 వన్డేల్లో 57.32 సగటుతో 12,898 రన్స్ చేశాడు. దాంట్లో 46 సెంచరీలు, 65 ఫిఫ్టీలు ఉన్నాయి. ఇక బాబర్ పేరిట 18 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
తొలి వంద మ్యాచుల్లో అత్యధిక రన్స్ చేసిన రెండవ బ్యాటర్ స్థానంలో ఆమ్లా ఉన్నాడు. అతను తొలి వంద వన్డేల్లో 53.42 సగటుతో 4808 రన్స్ ఛేశాడు. ఆ తర్వాత స్థానంలో శిఖర్ ధావన్ ఉన్నాడు. 46.1 సగటుతో ధావన్ 4309 రన్స్ చేశాడు.