న్యూఢిల్లీ: ఓ మర్డర్ కేసులో రెజ్లర్ సుశీల్ కుమార్ జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. సాగర్ ధంకర్ అనే వ్యక్తి హత్య కేసులో అరెస్టు అయిన ఒలింపిక్ రెజ్లర్ సుశీల్ ప్రస్తుతం తీహార్ జైలులో జైలు జీవితాన్ని సాగిస్తున్నాడు. అయితే జైలులో ఉన్న ఖైదీలకు సుశీల్ కుమార్ శిక్షణ ఇస్తున్నట్లు జైళ్లశాఖ డీజీ తెలిపారు. ఫిట్నెస్తో పాటు రెజ్లింగ్ కోచింగ్ను ఖైదీలకు ఇస్తున్నాడని, అతని వద్ద నుంచి 7 మంది ఖైదీలు రెజ్లింగ్లో శిక్షణ పొందుతున్నట్లు డీజీ చెప్పారు. సుశీల్ వద్ద జేఎన్టీయూ విద్యార్థి ఉమర్ ఖలీద్ శిక్షణ పొందుతున్నట్లు తెలిసింది. జైళ్లలో గత వారం రోజుల నుంచి శిక్షణ తరగతులు మొదలైనట్లు ప్రిజన్స్ డీజీ చెప్పారు. ఖైదీలు డిప్రెషన్లోకి వెళ్లకుండా ఉండేందుకు వాళ్లకు ఏదో రకమైన శిక్షణ ఇస్తుంటారు. సుశీల్ జైలులో శిక్షణ ప్రారంభించినట్లు ఆయన తరపు న్యాయవాది అడ్వకేట్ ప్రదీప్ రాణా తెలిపారు. బీజింగ్, లండన్ ఒలింపిక్స్లో సుశీల్ మెడల్స్ సాధించిన విషయం తెలిసిందే.