భోపాల్ : ఐఎస్ఎస్ఎఫ్ పిస్టల్/రైఫిల్ ప్రపంచకప్ షూటింగ్ చాంపియన్షిప్లో భారత షూటర్, ఒలింపియన్ మను బాకర్ కాంస్య పతకం దక్కించుకుంది. పతక రౌండ్లో బాకర్ 20 పాయింట్లతో మూడో స్థానానికి పరిమితం కాగా జర్మనీకి చెందిన డొరీన్ వెన్నెకాంప్ 30 పాయింట్లతో స్వర్ణం, చైనాకు చెందిన జియే దు 29 పాయింట్లతో రజతం దక్కించుకున్నారు. ఈ టోర్నీలో బాకర్కు దక్కిన తొలి పతకమిది.