ఇంఫాల్ : టోక్యో ఒలింపిక్స్లో భారత్కు రజత పతకం అందించిన వెయిట్లిఫ్టర్ మీరాబాయి చాను గొప్ప మనసు చాటుకుంది. వెయిట్ లిఫ్టింగ్లో శిక్షణ తీసుకుంటున్న సమయంలో తనకు లిఫ్ట్ ఇచ్చి సాయపడ్డ లారీ డ్రైవర్లను తగిన రీతిలో సన్మానించింది. శిక్షణ సమయంలో తన గ్రామం నుంచి ఇంఫాల్లోని స్పోర్ట్స్ కాంప్లెక్స్కు వెళ్లే క్రమంలో బస్సు చార్జీలకు డబ్బులు లేకపోవడంతో ఆమె ఇసుక లారీల్లో ప్రయాణించేది. లారీ డ్రైవర్లు తనను ఉచితంగా తీసుకెళ్లేవారని గుర్తు చేసుకున్న చాను.. సుమారు 150 మంది డ్రైవర్లను ఇంటికి పిలిపించి భోజనాలు పెట్టి సన్మానించింది.