Ranji Trophy 2024 | దేశవాళీ క్రికెట్లో భాగంగా జరుగుతున్న రంజీ ట్రోఫీ – 2024లో సంచలనం నమోదైంది. ముంబై – బరోడా మధ్య జరుగుతున్న క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్లో ముంబై పది, పదకొండో నెంబర్ బ్యాటర్లు సెంచరీలతో సరికొత్త చరిత్ర సృష్టించారు. బరోడాతో మ్యాచ్లో భాగంగా రెండో ఇన్నింగ్స్లో పదో నెంబర్ బ్యాటర్ తనూశ్ కొటియాన్ (129 బంతుల్లో 120 నాటౌట్, 10 ఫోర్లు, 4 సిక్సర్లు), తుషార్ దేశ్పాండే (129 బంతుల్లో 123, 10 ఫోర్లు, 8 సిక్సర్లు) లు సెంచరీలతో కదం తొక్కారు. ఈ ఇద్దరూ కలిసి ఆఖరి వికెట్కు ఏకంగా 232 పరుగులు జోడించడం గమనార్హం. దేశ్పాండే.. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే. గత సీజన్లో అతడు చెన్నై విజయాలలో కీలకపాత్ర పోషించాడు.
1946 తర్వాత ఇప్పుడే..
రంజీ క్రికెట్లో 10, 11వ నెంబర్ బ్యాటర్లు సెంచరీలు చేయడం ఇది రెండోసారి మాత్రమే. అంతకుముందు 1946లో చందు సర్వతె (124 నాటౌట్), షుటె బెనర్జీ (121)లు ఈ ఘనత అందుకున్నారు. అంతేగాక ఆఖరి వికెట్కు ఇన్ని పరుగులు జోడించడం కూడా ఇదే రికార్డు.
Tanush Kotian(120 not out) and Tushar Deshpande(123) become the second batters to score a century after coming at number 10 and 11 positions.
The same feat has been achieved by Chandu Sarwate(124 not out) and Banerjee (121) at The Oval against surrey in 1946.Both took the team… pic.twitter.com/YRNbyenp33
— Sujeet Suman (@sujeetsuman1991) February 27, 2024
కొటియాన్.. 115 బంతుల్లోనే మూడంకెల స్కోరును పూర్తిచేశాడు. మరోవైపు 112 బంతుల్లోనే దేశ్పాండే సెంచరీని అందుకున్నాడు. ఈ ఇద్దరికీ ఫస్ట్క్లాస్ కెరీర్లో ఇదే తొలి శతకం కావడం విశేషం. మరికొద్దిరోజుల్లో ఐపీఎల్ – 2024 ప్రారంభమవనుండగా దేశ్పాండే సెంచరీతో చెలరేగడంతో తమిళ తంబీలు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. తమ బ్యాటింగ్ లైనప్ లోతు మరింత పెరిగిందని వాళ్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఇద్దరూ దంచికొట్టడంతో రెండో ఇన్నింగ్స్లో ముంబై.. 569 పరుగుల భారీ స్కోరు సాధించింది.
Century from Tushar Deshpande batting at No.11 🥳💛#WhistlePodu #RanjiTrophy
📸 Jio Cinema pic.twitter.com/wTlOE9MI7k— WhistlePodu Army ® – CSK Fan Club (@CSKFansOfficial) February 27, 2024