సావొపాలొ : బ్రెజిల్ పారా బ్యాడ్మింటన్ అంతర్జాతీయ చాంపియన్షిప్లో 18 ఏళ్ల నిత్యశ్రీ సుమంతి సుమన్ రెండు స్వర్ణాలతో మెరిసింది. మహిళల ఎస్హెచ్ 6 విభాగం ఫైనల్లో నిత్యశ్రీ పెరూకు చెందిన గిలియాన పొవెడ ఫోరెస్ను 22-20, 21-11తో ఓడించి విజేతగా నిలిచింది. అదే విభాగం డబుల్స్ ఫైనల్లో శివరాజన్తో కలిసి హాంకాంగ్ జోడి చు మన్ కై-చొయి వింగ్ కీలను ఓడించి పసిడి సొంతం చేసుకుంది. ఈ టోర్నీలో ఇండియా 6 స్వర్ణాలు, 7 రజతాలు, 11 కాంస్య పతకాలతో మొత్తం 24 పతకాలు సాధించి సత్తాచాటింది. పురుషుల డబుల్స్లో ప్రమోద్ భగత్-సుకాంత్ కదమ్ స్వర్ణం, పురుషుల సింగిల్స్లో కుమార్ నితేష్కు స్వర్ణం, ప్రమోద్ భగత్కు రజతం, తరుణ్ కాంస్యం గెలుచుకున్నారు. మానసి జోషి రజతం దక్కించుకున్నారు.