ODI World Cup | ప్రపంచ కప్ టోర్నమెంట్-2023లో భాగంగా గురువారం బెంగళూరులో జరిగిన మ్యాచ్లో శ్రీలంకపై న్యూజిలాండ్ భారీ విజయం సాధించింది. తొలుత నిర్దేశిత 50 ఓవర్లలో 171 పరుగులకే శ్రీలంకను కట్టడి చేసిన న్యూజిలాండ్.. తర్వాత 172 పరుగుల విజయ లక్ష్యాన్ని తేలిగ్గా చేధించింది. కేవలం ఐదు వికెట్లు కోల్పోయి 23.2 ఓవర్లలోనే విజయం సాధించింది. న్యూజిలాండ్ ఓపెనర్లు డెనోన్ కాన్వే 45, రచిన్ రవీంద్ర 42, డేరీ మిచెల్ 43 పరుగులతో పర్వాలేదనిపించారు. శ్రీలంక బౌలర్లలో అంగెలో మాథ్యూస్ రెండు, దుష్మంతా చమీరా, మహేశ్ తీక్షణ చెరో వికెట్ తీశారు.
తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక బ్యాటర్లలో ఓపెనర్ కుశాల్ పెరీరా 51, మహేశ్ తీక్షణ 38 పరుగులు చేశారు. ధనంజయ డిసిల్వా19, డిల్షాన్ మదుశంక 19 , అంగెలో మాథ్యూస్ 16 పరుగులతో పర్వాలేదనిపించినా మిగతా బ్యాటర్లు చేతులెత్తేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ మూడు, లక్కీ ఫెర్గూసన్, మిచెల్ షాత్నర్ రెండేసి వికెట్లు, టిమ్ సోథే ఒక వికెట్ తీశారు.