ముంబై : రెండవ టెస్టులో అజాల్ పటేల్ ఒకే ఇన్నింగ్స్లో పది వికెట్లు తీసినా.. ఆ ఆనందాన్ని న్యూజిలాండ్ నిలుపుకోలేకపోతున్నది. తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కివీస్ ఇవాళ టీ సమయానికి ఆరు వికెట్లు కోల్పోయి కేవలం 38 రన్స్ మాత్రమే చేసింది. ఇవాళ ఉదయం ఇండియా 325 రన్స్కు తన తొలి ఇన్నింగ్స్లో ఆలౌటైంది. కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్ 10 వికెట్లు తీసి.. ఆ ఘనతను అందుకున్న మూడవ బౌలర్గా రికార్డు క్రియేట్ చేశాడు. అయితే తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన న్యూజిలాండ్ త్వరత్వరగా వికెట్లను కోల్పోయింది. సిరాజ్ మూడు వికెట్లు తీయగా.. అశ్విన్, జయంత్, అక్షర్లు ఒక్కో వికెట్ తీసుకున్నారు.