బ్రిడ్జ్టౌన్: పరుగుల వరద పారిన పోరులో న్యూజిలాండ్దే పైచేయి అయింది. వెస్టిండీస్తో సోమవారం ఉదయం ముగిసిన మూడో వన్డేలో కివీస్ 5 వికెట్ల తేడాతో గెలిచి 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. మొదట విండీస్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 301 పరుగులు చేసింది.
మయేర్స్ (105; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో కదం తొక్కగా.. కెప్టెన్ నికోలస్ పూరన్ (55 బంతుల్లో 91; 4 ఫోర్లు, 9 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కివీస్ బౌలర్లలో బౌల్ట్ 3, శాంట్నర్ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేదనలో న్యూజిలాండ్ 47.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 307 రన్స్ చేసింది. లాథమ్ (69), మిషెల్ (63), గప్టిల్ (57), కాన్వే (56) హాఫ్సెంచరీలతో రాణించారు.