నేపియర్ (న్యూజిలాండ్): పొట్టి ఫార్మాట్లోనూ బంగ్లాదేశ్ను చిత్తుచేసిన న్యూజిలాండ్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సిరీస్ పట్టేసింది. మంగళవారం జరిగిన రెండో టీ20లో డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం కివీస్ 28 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట న్యూజిలాండ్ 17.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. గ్లెన్ ఫిలిప్స్ (58 నాటౌట్), మిషెల్ (34 నాటౌట్) రాణించారు. ఈ దశలో వర్షం కారణంగా బంగ్లాదేశ్ లక్ష్యాన్ని 16 ఓవర్లలో 171గా నిర్ణయించగా.. బంగ్లా 7 వికెట్లు కోల్పోయి 142 రన్స్కు పరిమితమైంది. సౌమ్య సర్కార్ (51) టాప్ స్కోరర్గా నిలిచాడు.