హైదరాబాద్, ఆట ప్రతినిధి: స్వీడన్, పోలాండ్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ప్రపంచ హ్యాండ్బాల్ టోర్నీకి జాతీయ అధ్యక్షుడు జగన్మోహన్రావుకు ఆహ్వానం అందింది. ఈ నెల 27 నుంచి 29 తేదీ వరకు జరుగనున్న మెగాటోర్నీ నాకౌట్ మ్యాచ్లను జగన్ వీక్షించనున్నారు.
టోర్నీ ముగింపు వేడుకల్లో ప్రసంగించే అవకాశం ఆయనకు లభించింది. తన ప్రసంగంలో దేశంలో హ్యాండ్బాల్కు ఉన్న ఆదరణ, క్రీడాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై వివరించనున్నారు. దీనికి తోడు హ్యాండ్బాల్ ప్రీమియర్ లీగ్ నిర్వహణపై మాట్లాడనున్నారు. అలాగే అంతర్జాతీయ హ్యాండ్బాల్ సమాఖ్య నుంచి కావాల్సిన సహకారాన్ని జగన్ కోరనున్నారు.