షిల్లాంగ్ : ఆరుసార్లు ఆసియా చాంపియన్షిప్ గెలిచిన శివ థాపా(63.5కి.), అమిత్ పంగల్(51కి.) జాతీయ బాక్సింగ్ చాంపియన్షిప్లో క్వార్టర్స్కు చేరుకున్నారు. గత టోర్నీలో స్వర్ణం సాధించిన థాపా తన సత్తా చాటుతూ కర్నాటకకు చెందిన సంతోష్పై 5-0 తేడాతో గెలుపొందాడు.
మరో పోటీలో పంగల్ 4-1తో పంజాబ్కు చెందిన జైసందీప్ సింగ్పై విజయం సాధించాడు. 92 కిలోల విభాగంలో సంజీత్ 5-0తో సావన్ గిల్ను ఓడించాడు. తదుపరి రౌండ్లో సంజీత్ ఆర్ఎస్పీబీకి చెందిన నమన్ తన్వార్ను ఢీకొంటాడు.