హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ బాస్కెట్బాల్ లీగ్ చాంపియన్షిప్లో తెలంగాణ టైటిల్ విజేతగా నిలిచింది. ఆదివారం బెంగళూరు శ్రీ కంఠీరవ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో తెలంగాణ 21-18తో కోల్కతాపై అద్భుత విజయం సాధించింది. ఆద్యంతం హోరాహోరీగా సాగిన తుదిపోరులో రాష్ట్ర జట్టు తరఫున పుష్ప ఎనిమిది పాయింట్లతో అదరగొట్టగా, అంబరసి(6), ప్రియాంక(5) రాణించారు.
3 X 3 పద్ధతిలో తొలిసారి జరిగిన టోర్నీలో మన ప్లేయర్లు అంచనాలకు అనుగుణంగా ప్రతిభ చాటారు. దేశంలోని 20 నగరాలు పోటీపడ్డ టోర్నీలో తెలంగాణ తరఫున బరిలోకి దిగిన పుష్ప సెంథిల్కుమార్, అంబరసి, అశ్వతీ థంపీ, ప్రియాంక ప్రభాకర త్వరలో జరుగనున్న అంతర్జాతీయ టోర్నీకి భారత జట్టుకు ఎంపికయ్యారు.