టీ20 వరల్డ్ కప్లో భాగంగా సూపర్ 12లో చివరి మ్యాచ్ ప్రారంభం అయింది. ఇండియా, నమీబియా మధ్య పోరు జరుగుతోంది. టాస్ గెలిచిన భారత్.. ఫీల్డింగ్ ఎంచుకోవడంతో నమీబియా మొదట బ్యాటింగ్కు దిగింది.
నమీబియా ఓపెనర్లు స్టీఫన్ బార్డ్, మైకెల్ వాన్ లింగెన్ ప్రారంభం నుంచి కాస్త దూకుడుగానే ఆడారు. అయితే.. 5 వ ఓవర్లో మైకెల్ను బుమ్రా అవుట్ చేశాడు. మహమ్మద్ షమీకి క్యాచ్ ఇచ్చి మైకెల్ పెవిలియన్ చేరాడు. నమీబియా 5 ఓవర్లకు ఒక వికెట్ నష్టానికి 33 పరుగులు చేసింది.
భారత బౌలర్లలో మహమ్మద్ షమీ 2 ఓవర్లు వేసి 14 పరుగులు ఇవ్వగా.. జస్ప్రిత్ బుమ్రా… 2 ఓవర్లు వేసి ఒక వికెట్ తీశాడు. రవిచంద్రన్ అశ్విన్ ఒక ఓవర్ వేసి 5 పరుగులే ఇచ్చాడు.