WPL | బెంగళూరు: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్కు శుక్రవారం తెరలేవనుంది. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్తో రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ తొలి మ్యాచ్లో తలపడనుంది. మొత్తం ఐదు జట్లు (ఢిల్లీ, గుజరాత్, ముంబై, బెంగళూరు, యూపీ) పాల్గొంటున్న ఈ లీగ్.. గ్రూప్ దశలో 20 మ్యాచ్లు జరగనున్నాయి. తొలి మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుండగా.. మిగిలిన మ్యాచ్లన్నీ 7.30 నుంచి మొదలవుతాయి. నిరుడు జరిగిన డబ్ల్యూపీఎల్ మంచి ప్రజాదరణ దక్కించుకోగా.. ఈ సారి బెంగళూరు, ఢిల్లీలో మ్యాచ్లు నిర్వహించనున్నారు.
గత డబ్ల్యూపీఎల్తో మెరిసిన వారిలో శ్రేయాంక పాటిల్, టిటాస్ సధు వంటి వాళ్లు ఇటీవల జాతీయ జట్టు తరఫున అవకాశం దక్కించుకోగా.. ఈ సారి తమ వంతుకోసం యంగ్ ప్లేయర్స్ ఎదురుచూస్తున్నారు. టీమ్ఇండియా స్టార్లు హర్మన్ప్రీత్కౌర్, స్మృతి మంధన, జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, దీప్తి శర్మతో పాటు.. అంతరాతీయ స్టార్లు అలీసా హీలీ, లానింగ్, అమేలియా కెర్,్ర మాత్యూస్, స్కీవర్, చమరీ ఆటపట్టు ఈ లీగ్లో భాగం కాబోతున్నారు.