పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీలో రెండో సీడ్ సబలెంకకు చుక్కెదురైంది. మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో గురువారం ముచోవా 7-6 (7/5), 6-7 (5/7), 7-5తో సబలెంకను చిత్తుచేసి ఫైనల్లో అడుగుపెట్టింది. మూడు గంటలకు పైగా హోరాహోరీగా సాగిన పోరులో ఇరువురు ప్లేయర్లు ఒక్కో పాయింట్ కోసం తీవ్రంగా శ్రమించారు. 6 ఏస్లు సంధించిన ముచోవా తొలి సెట్ను సొంతం చేసుకోగా.. 44 విన్నర్లు సంధించిన సబలెంక రెండో సెట్లో పోరాడి గెలిచింది. ఇక ఉత్కంఠ భరితంగా సాగిన మూడో సెట్లో ముచోవా ఆధిక్యం కనబర్చింది.
పురుషుల సింగిల్స్లో శుక్రవారం అసలు సిసలు పోరు జరుగనుంది. టాప్ సీడ్ అల్కరాజ్తో సెర్బియా వీరుడు జొకోవిచ్ తలపడనున్నాడు. ఓపెన్ ఎరాలో అత్యధిక గ్రాండ్స్లామ్లు సాధించిన నాదల్ (22)తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్న జొకోవిచ్కు యంగ్గన్ అల్కరాజ్తో హోరాహోరీ తప్పకపోవచ్చు. కాస్పెర్ రూడ్, జ్వెరెవ్ మరో సెమీస్లో అమీతుమీ తేల్చుకోనున్నాడు.