Ravichandran Ashwin : ఎం.ఎస్.ధోనీ మొదటి ప్రయత్నంలోనే వరల్డ్ కప్ అందుకున్నాడని, అది అందరికీ సాధ్యం కాకపోవచ్చని టీమిండియా ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. అంతేకాదు ఆటగాళ్లను బేరీజు వేసేందుకు ఐసీసీ ట్రోఫీ ఒక్కటే ప్రామాణికం కాదని అతను తెలిపాడు. ‘1983 తర్వాత భారత జట్టు వన్డే వరల్డ్ కప్ ట్రోఫీని అందుకునేందుకు 28 ఏళ్లు పట్టింది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వరల్డ్ కప్ ట్రోఫీ నెగ్గడానికి ఆరు వరల్డ్ కప్లు ఆడాల్సి వచ్చింది. అతను 1992, 1996, 1999, 2003, 2007, 2011 వరల్డ్ కప్ టోర్నీలు ఆడాడు. చివరకు 2011లో అతని కల నిజమైంది. ఎం.ఎస్.ధోనీ వచ్చి రావడంతోనే వరల్డ్ కప్ గెలిచాడు. అయితే.. అందరి విషయంలో అలానే జరగాలనే రూల్ లేదు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు మరింత సమయం ఇవ్వాలి’ అని అని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.
మూడు సార్లు చేజారిన ట్రోఫీ
ధోనీ కెప్టెన్సీలో భారత్ 2007 టీ20 వరల్డ్ కప్, 2011లో వన్డే వరల్డ్ కప్ ఛాంపియన్గా అవతరించింది. అయితే.. ఆ తర్వాత టీమిండియా ఒక్క ఐసీసీ ట్రోఫీ నెగ్గలేదు. మూడుసార్లు ఐసీసీ ట్రోఫీకి చేరువగా వచ్చింది. కానీ, ఫైనల్లో ఓటమితో నిరాశపరిచింది. 2014లో టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో శ్రీలంకపై ఓడిపోయింది. ఆ తర్వాత 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్థాన్, భారత్పై గెలుపొందింది. ఐసీసీ తొలిసారి నిర్వహించిన వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్లో ఇండియా రెండో స్థానంలో సరిపెట్టుకుంది. 2021లో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో కివీస్ విజేతగా నిలిచింది. దాంతో.. ఈ ఏడాది స్వదేశంలో జరుగుతున్న వన్డే వరల్డ్కప్పై భారత్ దృష్టి పెట్టింది. ఎలాగైనా ట్రోఫీ ముద్దాడాలనే పట్టుదలతో ఉంది. విరాట్ కోహ్లీ, రోహిత్, శుభ్మన్ గిల్, సూర్యకుమార్, హార్దిక్, శ్రేయాస్ సూపర్ ఫామ్లో ఉన్నారు. సిరాజ్, షమీ, బుమ్రా, అక్షర్ పటేల్, ఉమ్రాన్ మాలిక్తో బౌలింగ్ విభాగం పటిష్టంగా కనిపిస్తోంది.