దుబాయ్: మిస్టర్ కూల్ ధోనీ.. ఐపీఎల్లో ఢిల్లీతో జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్లో తన మెరుపు ఇన్నింగ్స్తో చెన్నై జట్టును ఫైనల్లోకి చేర్చిన విషయం తెలిసిందే. చివరి ఓవర్లో మూడు బౌండరీలు కొట్టిన ధోనీ.. ఓ టాప్ ఫినిషర్ అన్న ట్యాగ్ను మళ్లీ సొంతం చేసుకున్నాడు. ఆదివారం రాత్రి మ్యాచ్ ముగిసిన తర్వాత ఆ అద్భుత క్షణాలను ధోనీ ఎంజాయ్ చేశాడు. ఇక ఆ మ్యాచ్ను వీక్షించిన ఇద్దరు చిన్నారుల్ని కూడా ధోనీ తన స్టయిల్లో థ్రిల్ చేశాడు. దుబాయ్ స్టేడియంలోని స్టాండ్స్లో మ్యాచ్ను వీక్షించిన ఇద్దరు అభిమానులకు మ్యాచ్ బాల్ను అందజేసి వారిని సర్ప్రైజ్ చేశాడు. ఆటోగ్రాఫ్ చేసిన బంతిని స్టాండ్స్లో ఉన్న ఇద్దరు చిన్నారుల వైపు విసిరాడు. ఎల్లో దుస్తుల్లో ఉన్న ఆ ఇద్దరూ తెగ సంతోషపడిపోయారు. చెన్నై కెప్టెన్ ఇచ్చిన గిఫ్ట్తో ఆ ఇద్దరూ ఆనందాన్ని పట్టుకోలేకపోయారు. పిల్లల మనసు దోచుకున్న ధోనీపై మాజీ క్రికెటర్ వాసీమ్ జాఫర్ కామెంట్ చేశారు. యువతరానికి ధోనీ ప్రేరణగా నిలుస్తున్నారని జాఫర్ తన ట్వీట్లో పేర్కొన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్లో ధోనీ 6 బంతుల్లో 18 రన్స్ చేసి అందర్నీ స్టన్ చేశాడు.