Hyderabad | హైదరాబాద్, ఆట ప్రతినిధి: హుస్సేన్సాగర్ వేదికగా మాన్సూన్ జాతీయ రెగెట్టా చాంపియన్షిప్ మంగళవారం మొదలైంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన పోటీల్లో ఎన్ఎస్ఎస్కు చెందిన నాన్సి రాయ్, అనిరాజ్ సైంధవ్ జోడీ ఆధిక్యంలో నిలిచింది.
అండర్-19 ఇంటర్నేషనల్ క్లాస్ విభాగంలో బరిలో దిగిన ఈ ద్వయం కీలక పాయింట్లను తమ ఖాతాలో వేసుకున్నారు. మరోవైపు వైసీహెచ్ తెలంగాణకు చెందిన ధరణి, మల్లేష్ రెండో స్థానంలో కొనసాగుతున్నది. అండర్-15 బాలికల అప్టిమిస్ట్ విభాగంలో దీక్షిత టాప్లో ఉండగా, బాలుర కేటగిరీలో ఏకలవ్య సత్తాచాటాడు.