IND vs AUS : అహ్మదాబాద్ టెస్టు (Ahmedabad test) తొలి ఇన్నింగ్స్లో భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. మిచెల్ స్టార్క్ ఓవర్లో అక్షర్ పటేల్ (79) బౌల్డ్ అయ్యాడు. దాంతో, 556 పరుగుల వద్ద అసీస్కు బ్రేక్ లభించింది. కోహ్లీ (Virat Kohli)తో కలిసి అక్షర్ మరోసారి విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. వీళ్లిద్దరూ ఆరో వికెట్కు 162 పరుగులు జోడించారు. ప్రస్తుతం కోహ్లీ 180, అశ్విన్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్ ప్రస్తుతం 80 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆసీస్ బౌలర్లలో లియాన్, మర్ఫీ రెండేసి వికెట్లు తీశారు. కునేమాన్, స్టార్క్ తలా ఒక వికెట్ పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 480 రన్స్కు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే.