హైదరాబాద్, నమస్తే తెలంగాణ: జాతీయ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్లో టైటిల్ దక్కించుకున్న తొలి తెలంగాణ ప్యాడ్లర్గా నిలిచిన ఆకుల శ్రీజను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు. స్థాయికి తగ్గ ఆటతీరుతో ప్రత్యర్థులను మట్టికరిపిస్తూ జాతీయ టోర్నీలో సత్తాచాటిన శ్రీజ.. సోమవారం మంత్రిని మర్యాదపూర్వకంగా కలుసుకుంది. సుదీర్ఘకాలంగా తీరని కలగా ఉన్న టైటిల్ను ఒడిసిపట్టుకున్న శ్రీజతో పాటు కోచ్ సోమ్నాథ్ ఘోష్ను ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రశంసించారు.
భవిష్యత్లో మరిన్ని విజయాలతో రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేయాలని ఆకాంక్షించారు. బర్మింగ్హామ్ వేదికగా జరుగనున్న ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ గేమ్స్లో దేశం తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశమున్న శ్రీజ, సోమ్నాథ్కు అన్ని విధాల సహకరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, చీఫ్ రిలేషన్స్ అధికారి అమర్నాథ్రెడ్డి, తెలంగాణ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ కార్యదర్శి ప్రకాశ్ రాజు తదితరులు పాల్గొన్నారు.