Minister KTR | జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) డైరెక్టర్గా హైదరాబాదీ వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టాడు. బెంగళూరులోని ఎన్సీఏ ప్రధాన కార్యాలయంలో లక్ష్మణ్ విధుల్లో చేరాడు. ఈ సందర్భంగా లక్ష్మణ్కు తెలంగాణ మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ‘కొత్త బాధ్యతలు చేపట్టిన సోదరుడు లక్ష్మణ్కు అభినందనలు.
జెంటిల్మెన్ అయిన నీతోపాటు.. రాహుల్ ద్రవిడ్ సారధ్యంలో భారత క్రికెట్ మరింత గొప్పగా, అద్భుతంగా ఉన్నత శిఖరాలు అధిరోహిస్తుందనే నమ్మకం నాకుంది’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇంతకుముందు ఎన్సీఏ డైరెక్టర్గా ద్రవిడ్ ఉన్నాడు. టీమిండియా కోచ్గా ద్రవిడ్ నియామకంతో ఎన్సీఏ పదవి ఖాళీ అయింది.
దీంతో లక్ష్మణ్కు ఈ బాధ్యతలు అప్పగించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఇంతకుముందు గత కొన్ని సీజన్లుగా ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మెంటార్గా, బెంగాల్ క్రికెట్ జట్టుకు బ్యాటింగ్ సలహాదారుగా లక్ష్మణ్ పనిచేశాడు. అయితే ఎన్సీఏ బాధ్యతలు చేపట్టాల్సి ఉండటంతో వీటి నుంచి వీవీఎస్ తప్పుకున్నాడు.
Congratulations on the new responsibility brother @VVSLaxman281 👏
— KTR (@KTRTRS) December 14, 2021
I am sure with gentlemen like you and #RahulDravid at the helm of affairs, future Indian cricket will scale newer/greater heights https://t.co/92nxVA6Rz1