ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో పవర్ప్లేలో రాజస్థాన్కు షాక్ తగిలింది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (1) మరోసారి నిరాశపరచగా.. మరో ఓపెనర్ జోస్ బట్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అతనికి కొంత సహకారం అందించిన దేవదత్ పడిక్కల్ (7) ఆరో ఓవర్ చివరి బంతిని అవుటయ్యాడు. మిల్స్ వేసిన బంతిని ముందుకొచ్చి ఆడేందుకు పడిక్కల్ ప్రయత్నించాడు.
అయితే టైమింగ్ కుదరకపోవడంతో చాలా బలహీనంగా బంతిని పుల్ చేశాడు. దాంతో గాల్లోకి లేచిన బంతిని ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ సులభంగా అందుకున్నాడు. దీంతో ఆరు ఓవర్లు ముగిసే సరికి రాజస్థాన్ జట్టు 48/2 స్కోరుతో నిలిచింది. జాస్ బట్లర్ (40 నాటౌట్) అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. పడిక్కల్ వెనుతిరగడంతో అతనికి కెప్టెన్ సంజూ శాంసన్ జత కలిశాడు.