హాఫ్ సెంచరీతో ఆర్సీబీకి సూపర్ ఓపెనింగ్ అందించిన అనూజ్ రావత్ (66) రనౌట్ అయ్యాడు. 17వ ఓవర్లో కోహ్లీ రెండు పరుగులకు పిలవడంతో రావత్ రెండో పరుగు కోసం ప్రయత్నించాడు. ఈ క్రమంలో రమన్దీప్ సింగ్ వేసిన డైరెక్ట్ త్రోకు బలయ్యాడు.
దీంతో బెంగళూరు రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో కోహ్లీతోపాటు దినేష్ కార్తీక్ను దింపారు. బెంగళూరు విజయానికి ఇంకా మూడు ఓవర్లలో 22 పరుగులు కావలసి ఉంది.